News

గద్వాలపై ఎందుకంత కసి


మాజీ మంత్రి డీకే అరుణ సీఎం కేసీఆర్ పంతం పట్టి మరీ గద్వాల జిల్లా ఏర్పాటును పక్కన పెట్టారని మరోసారి ఆరోపించారు. ముఖ్యమంత్రికి గద్వాల పై ఎందుకింత కసి అని ఆమె ప్రశ్నించారు. జిల్లాలపై వచ్చిన అభ్యంతరాల్లో అత్యధికంగా వనపర్తిపై వచ్చాయని.. గద్వాలను జిల్లా చేయాలని వారంతా విజ్ఞప్తి చేశారని డీకే అరుణ చెప్పారు. ఐతే కలెక్టర్ల సమీక్షా సమావేశంలో గద్వాలపై వచ్చిన విజ్ఞాపణలన్నీ ఒకే వ్యక్తి నుంచి వచ్చాయని వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ చెప్పడం గద్వాల ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరచడమేనని మండిపడ్డారు.